Saturday, July 27, 2024

ఇంజిక్షన్ విక‌టించి విద్యార్థి మృతి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హసన్ పర్తి : ఇంజిక్షన్ విక‌టించి విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న హ‌స‌న్‌ప‌ర్తిలో సోమ‌వారం చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండ‌ల‌ కేంద్రానికి చెందిన మీసరకొండ అవినాష్ (12) మామునూరులోని మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే అవినాష్‌కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం హసన్ పర్తిలోని ఓ ఆర్ ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షించిన ఆర్ ఎంపీ బాలుడికి జ్వరం వచ్చిందని చెప్పి రెండు ఇంజిక్షన్లు ఇచ్చాడు. అయితే సోమవారం తెల్లవారుజామున బాలుడు చనిపోయాడు. కాగా, ఆర్ ఎంపీ ఇచ్చిన ఇంజిక్ష‌న్ విక‌టించే త‌మ కొడుకు మ‌ర‌ణించాడ‌ని మృతుడి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img