Friday, July 26, 2024

బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ..

Must Read

హైదరాబాద్ నగరంలోని దమ్మాయిగూడలో చిన్నారి అనుమానాస్ప‌ద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డి మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఇందు ( 10 ) మృతిచెందిందని వైద్యులు తమ నివేదికలో వెల్లడించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. జవహర్‌నగర్‌కు చెందిన ఇందు.. ఈ నెల 15న దమ్మాయిగూడలోని స్కూల్‌కు వెళ్లి అదృష్యమైంది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆమె మృతదేహాన్ని దమ్మాయిగూడలోని అంబేద్కర్‌నగర్‌ చెరువులో గుర్తించిన విషయం తెలిసిందే. మూత్ర విసర్జన కోసం చెరువు వద్దకు వెళ్లి కాలుజారి పడినట్లు నిర్ధారించారు. ఇక ఇందు మృతిపై అనుమానాలు లేవని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఆమె మరణించినట్లు గుర్తించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img