Saturday, July 27, 2024

క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..? ఈడీ విచార‌ణ‌పై తీవ్ర ఉత్కంఠ‌ !

Must Read

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీని ప్ర‌శ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందం
తెలంగాణ‌, ఢిల్లీలో హైఅలర్ట్‌..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి క‌విత వెళ్లారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌… అక్క‌డి నుంచి భ‌ర్త అనిల్‌, న్యాయ‌వాదులు, పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఈడీ కార్యాల‌యానికి చేరుకోగా, క‌విత ఒక్క‌రినే ఆఫీస్‌లోకి అనుమతించారు. లిక్క‌ర్ స్కాంలో క‌విత‌ను ఐదుగురు అధికారుల బృందం ప్ర‌శ్నిస్తోంది. విచార‌ణ త‌ర్వాత ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే చాలాచోట్ల భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. క‌విత విచార‌ణ నేప‌థ్యంలో ఢిల్లీతోపాటు తెలంగాణ‌లో హైటెన్ష‌న్ నెల‌కొంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img