Sunday, September 8, 2024

సైఫ్‌ను ఉరితీయాలి

Must Read

బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్
వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌కు ఉరి శిక్ష విధించాలని బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్ డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్ లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల కిరణ్ మాట్లాడుతూ ఎంతో ఉజ్వల భవిష్యత్తు గ‌ల గిరిజన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటనతో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయనడానికి నిదర్శనమన్నారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, నిందితుడు సైఫ్‌ను ఉరితీయాలన్నారు. కాగా, ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుసుమ సతీష్, సీనియర్ నా యకులు సముద్రాల పరమేశ్వర్, బన్న ప్రభాకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, బైరి శ్యాం, గోకె వెంకటేష్, ఆడెపు వెంకటేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బండారి కల్యాణి, సూత్రపు సరిత, బండి సుజాత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img