అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హన్మకొండ విజయపాల్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నవయుగ పాఠశాల హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి వంగపడ్ల వివేక్ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి సుబేదారి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.