అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; నర్సంపేట్ , ఖానాపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక ఎస్సై పిట్టల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన మద్దెల సూర్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ ఖానాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు . నర్సంపేట పట్టణంలో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాదులో నిమ్స్ హాస్పిటల్ తరలించారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తమతో కలిసి విధుల నిర్వహిస్తున్న సూర్యనారాయణ మృతి చెందడంతో ఖానాపూర్ ఎస్ఐ తిరుపతి తో పాటు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.