యువతకు నాయకత్వం అప్పగించాలన్న ప్రజాయుద్ధనౌక
అక్షరశక్తి, హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీని ప్రజా యుధ్దనౌక గద్దర్ కలిశారు. తెలంగాణ ఉద్యమకారులు హరగోపాల్, కంచె ఐలయ్యతో కలిసి గద్దర్ ఇవాళ ఉదయం రాహుల్ను కలిశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన గద్దర్.. రాహుల్ను మనవడని సంబోధించారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకవెళ్తానన్నారు. తెలంగాణ సాధించుకున్నాక కూడా ఎవరూ సంతృప్తిగా లేరన్నారు. తెలంగాణలో గుణాత్మక మార్పు లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువతకు నాయకత్వం అప్పగించాలని కోరారు. యువ నాయకత్వం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలని గద్దర్ అన్నారు.
Must Read