Saturday, September 7, 2024

ఫ్లాష్‌..ఫ్లాష్‌.. ఫిజిక‌ల్ ఈవెంట్ల‌లో అప‌శృతి

Must Read

అస్వస్థతకు గురైన అభ్యర్థి
ఎంజీఎంకు త‌ర‌లింపు… యోగ‌క్షేమాలు తెలుసుకున్న సీపీ
పోలీస్ కానిస్టేబుల్‌, ఎస్సైల నియామకాల్లో భాగంగా కేయూ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ‌నివారం నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం అభ్య‌ర్థి అస్వస్థత గుర‌య్యాడు. వెంట‌నే పోలీసులు ఎంజీయం ద‌వాఖాన‌కు తరలించారు.

ప్ర‌స్తుతం అభ్యర్థికి ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా అభ్యర్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎంజీఎం చేరుకొని బాధితుడిని ప‌రామ‌ర్శించారు.

అభ్యర్థికి అందిస్తున్న చికిత్సను పరిశీలించడంతోపాటు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ వైద్యులకు సూచించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img