- రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన
14వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తూర్పటి సులోచన,
హన్మకొండ మాజీ జెడ్పీటీసీ సారయ్య.. - హస్తంగూటికి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓదెల రవితేజ ..
అక్షరశక్తి, హసన్పర్తి: వర్దన్నపేట ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తూర్పటి సులోచన, హన్మకొండ మండల మాజీ జెడ్పీటీసీ తూర్పటి సారయ్య కాంగ్రెస్ లో చేరారు. శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓదెల రవితేజ కూడా హస్తం గూటికి చేరారు. ఏఐసీసీ అబ్జర్వర్ ఉత్తమ్ రవీంద్ర దళ్వి, టీ పీసీసీ వరంగల్ పార్లమెంట్ అబ్జర్వర్ బండ్రు శోభరాణి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వీరికి కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు.