- కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
- వరంగల్ లో సకల జనుల విజయ సంకల్ప సభ
- వేలాదిగా తరలవచ్చిన పార్టీ శ్రేణులు..
అక్షరశక్తి, వరంగల్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్షా ముఖ్య అథిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్భంగా అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులుచెరిగారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో రెండున్న లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ యువతను కూడా కేసీఆర్ మోసంచేశాడని ఫైర్ అయ్యారు. సభలో వరంగల్ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావు, వరంగల్ పశ్చిమ అభ్యర్థి రావు పద్మ, పరకాల అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా విజయ సంకల్ప సభకు బీజేపీ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. - అమిత్షాను సత్కరించిన రావు పద్మ
ఖిల్లా వరంగల్లో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మ శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా నాయకులతో కలిసి భద్రకాళీ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
Must Read