Saturday, September 7, 2024

హ‌త్య‌కేసులో నిందితులకు రిమాండ్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వ‌రంగల్ కాశీబుగ్గ శాంతినగర్‌కు చెందిన రాకేష్ ఆనే యువకుడిపై ఈనెల 5వ తేదీ రాత్రి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో దాడి చేసిన ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీధర్, బన్నీ, ప్రవీణ్ గరీబ్ నగర్ చెందిన వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి నిందితుల అరెస్ట్ వివ‌రాలు వెల్ల‌డించారు. రాకేష్ ఒంటిపై ఉన్న బంగారు గొలుసు ఉంగరాలు డబ్బును దోచుకునేందుకు ముగ్గురు వ్యక్తులు పాశ‌వికంగా దాడికి తెగ‌బ‌డ్డారు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించ‌గా, చికిత్స పొందుతూ ఈనెల 12వ తేదీన మృతి చెందిన విష‌యం తెలిసిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img