Saturday, July 27, 2024

కేసీఆర్‌ను త‌రిమికొడుదాం..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, జనగామ, ఫిబ్రవరి 6 : దేశ ప్రజల ఆత్మగౌరవమైన భారత రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ అనడం దేశ ప్రజల ఆత్మ అభిమానాన్ని కించపరిచిన‌ట్లేన‌ని, తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టాలని కాంగ్రెస్ నేత‌, దొమ్మటి సాంబయ్య, పీసీసీ సభ్యులు గంగారపు అమృత రావు అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం ఘ‌న్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే తదనంతరం జరిగే పరిణామాలను కేసీఆరే బాధ్య‌త వ‌హించాల‌ని హెచ్చ‌రించారు.

కేసీఆర్ క్షమాపణ చెప్పకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బొజ్జ సమ్మయ్య యాదవ్, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పేర్ని ఉష రవి, మండల ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, వైస్ ఎంపీపీ రంగమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి, జిల్లా మాజీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కడారి నగేష్, జిల్లా నాయకులు మహేందర్ రెడ్డి, రాపోలు రామ్మూర్తి, హర్యా నాయక్, ఎంపీటీసీ లు సురేష్, ఉష రవి, యూత్ నియోజకవర్గ ఉపాధ్య‌క్షులు నీలం యువరాజ్, గ్రామ అధ్యక్షుడు (మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కడారి నగేష్(చిన్న), త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img