Saturday, July 27, 2024

వారంలో రెట్టింపైన క‌రోనా కేసులు

Must Read

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకుపైగానే నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండడంతో క్రియాశీల కేసుల సంఖ్య 16 వేలు దాటింది.

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాలు..

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.02 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయగా.. 2,541మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,522 మందికి పైగా కరోనాతో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా ఉంది. నిన్న మరో 30 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5,22,223 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. మరోవైపు భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 3.64 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img