అక్షరశక్తి, హైదరాబాద్ : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దౌల్తాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తప్రసావంతో బాధపడుతున్న ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.