- కాంగ్రెస్లోకి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
- నేటి రాత్రి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక !
- రేపు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా..
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్ బై చెబుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా మరో కీలక నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడేందుకు సిద్ధం అయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం ఢిల్లీలో అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వివేక్ చేరిన తర్వాత రేపు (మంగళవారం) ఉదయం కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను ఏఐసీసీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా వివేక్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Must Read