అక్షరశక్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చేనులో నాగలితో అచ్చుకొడుతుండగా నాగలికి విద్యుత్ వైర్లు తగిలి రైతు బత్తిని కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలిపైనే పడి రైతు కన్నుమూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు, రైతులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతం మృతి చెందాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. మృతుడికి భార్య పద్మ , కొడుకు , కూతురు ఉన్నారు.