వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ జెడ్పీటీసీ మృతి చెందాడు. గీసుగొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో కారు, బస్సు ఢీకొనడంతో కేసముద్రం మాజీ జెడ్పీటీసీ వేం పురుషోత్తంరెడ్డి అ క్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మానుకోట మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి పురుషోత్తంరెడ్డి స్వయాన పెద్దన్న. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Must Read