Saturday, July 27, 2024

అనుమానంతో గొంతుకోశాడు

Must Read
  • మానుకోటలో దారుణం

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణంచోటుచేసుకుంది. పట్టణంలోని అడ్వకేట్ కాలనీలో జాటోత్ భాస్కర్ అనే వ్యక్తి తన భార్య కల్పన (30) గొంతు కోసి హత్య చేశాడు. గురువారం ఉదయం కల్పన పనికి వెళ్తుండగా భాస్కర్ అడ్వకేట్ కాలనీలో అడ్డ‌గించి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. కల్పన ఇళ్లలో పనిచేస్తుండగా భాస్కర్ జిల్లా కేంద్రంలో మటన్ షాప్ నిర్వ‌హిస్తున్న‌ట్లు సమాచారం. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. భార్య కల్పనపై అనుమానంతోనే భాస్కర్ ఈ దారుణానికి తెగించిన‌ట్లు తెలిసింది. స మాచారం అందగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కల్పన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img