నక్కలగుట్ట సువిద్ర కళాశాలో ఘటన
హన్మకొండ నక్కలగుట్టలోని సువిద్య జూనియర్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మురారిశెట్టి నాగజ్యోతి బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై కళాశాల హాస్టల్కు చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో తన రూంలో ఉరి వేసుకోగా మిత్రులు గమనించి కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానకి తరిలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా , చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.