ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
అక్షరశక్తి, నర్సంపేట : కల్యాణ లక్ష్మి పథకం నగదును వృథా చేయకుండా పెళ్లికోసం చేసే అప్పును తీర్చడానికి ఉపయోగించుకునేలా జాగ్రత్తపడాలని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 141 మంది మహిళలకు రూ. కోటి 14 లక్షల, 16 వేల విలువైన కళ్యాణాలక్ష్మి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని తట్టుకుని కళ్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఆడబిడ్డల వివాహాలకు కట్నం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ ఎస్ ప్రభుత్వ మేనని తెలిపారు. పార్టీలకతీతంగా, పైసా లంచం, పైరవీలు లేకుండా నిరుపేదలైన ఎంతో మంది పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో, తహశీల్దార్లు, జెడ్పి కోఆప్షన్ సభ్యులు, ఎంపీడీవోలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.