అక్షరశక్తి, వెంకటాపూర్ : ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండలంలోని బూర్గుపేట గ్రామంలో ఎస్ఐ తాజ్జోద్దీన్ వరద బాధితులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం వరద బాధితుల కుటుంబాలకు వంట సామగ్రితో పాటు దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ తాజోద్దీన్ మాట్లాడుతూ.. వరద బాధితుల కుటుంబాలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగా ఉంటారని తెలిపారు. ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులు ప్రజలకు తోబుట్టువులని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గుపేట గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు.