- బీఆర్ఎస్కు వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్ల రాజీనామా..
- గులాబీ పార్టీకి బిగ్ షాక్
అక్షరశక్తి, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ముసలంపుట్టింది. బీఆర్ఎస్కు చెందిన వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్లు ఆపార్టీ సభ్యత్వానికి ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు. కౌన్సిలర్ల పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నియంతృత్వ వైఖరి నచ్చకే గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్ ఒంటెద్దు పోకడతో విసిగిపోయి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల రాజీనామాల నేపథ్యంలో నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.
Must Read