అక్షశక్తి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం హనుమకొండలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎల్ రమేష్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. రావు పద్మ వెంట మాజీ ఎమ్మెల్యే మర్తినేని ధర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశిని సదానందం గౌడ్ తదితరులు ఉన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు రావు పద్మ భద్రకాళీ ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Must Read