అక్షరశక్తి, పర్వతగిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గురువారం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ కుటుంబ సభ్యులతోపాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.