Saturday, July 27, 2024

వరంగ‌ల్ ప‌శ్చిమ‌లో గెలుపు నాదే..

Must Read

ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా జంగా రాఘ‌వ‌రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : ఈ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు త‌న‌దేన‌ని డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామేష‌నేష‌న్ దాఖ‌లు చేశారు. అదేవిధంగా, ఏఐఎఫ్‌బీ సింహం గుర్తుపై మ‌రో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సందర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. త‌మ‌ది కాంగ్రెస్ కుటుంబ‌మ‌ని, త‌న‌కే బీఫాం ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఇప్ప‌టికీ అధిష్టానంపై న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు. నామినేషన్ దాఖలు ముందు భద్రకాళి ఆలయంలో రాఘవ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి గ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వరంగల్ పశ్చిమలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ కు జంగా రాఘవరెడ్డి మధ్య మాత్రమే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తనకు ప్రత్యర్థి కాదని జంగా రాఘవరెడ్డి అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img