Saturday, July 27, 2024

దేవుడి సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నా..

Must Read
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తా…
  • ఒక్క అవకాశం ఇవ్వండి… నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపుతా..
  • భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు
    అక్షరశక్తి , భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దేవుడి సాక్షిగా అమలుచేస్తానని సీపీఐ బలపరిచిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు సోమ‌వారం ఉదయం స్వగ్రామం బుద్ధారంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు శేషాచార్యులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ హామీ అఫిడవిట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాలల్లో పాలుపంచుకుంటానని అన్నారు. నియోజకవర్గ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని, నిజాయితీగా ఉంటానని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటానని ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img