- యజమానులపై చీటింగ్ కేసు నమోదు
వరంగల్ పోలీస్ కమిషరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న 348 వాహనాలను సీజ్ చేసిన సదరు వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ట్రై సిటీ పరిధితో పాటు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ లేనివి, మార్ఫింగ్ చేసినవి, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నంబర్ ప్లేట్లకు మాస్కులు పెట్టిన వాహనాలను గుర్తించి వాహన యజమానులపై చీటింగ్ కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. - ఈ మేరకు గత నెల మొదటి తారీకు నుండి ఇప్పటి వరంగల్ ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా రోజువారి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 348 వాహనాలు సీజ్ చేయగా ఇందులో కార్లు 4, ఆటోలు ఒకటి, ద్విచక్రవాహనాలు 343, ఈ సీజ్ వాహనాల్లో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 93, హన్మకొండ 126, కాజీపేట 72 వాహనాలు ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. అప్పగించిన వాహన యజమానులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులను నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఈ బాబులాల్, రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ ఎస్ఐలు రాజబాబు, డేవిడ్, మిల్స్ కాలనీ ఎస్ఐ సాంబయ్య పాల్గొన్నారు.
Must Read