- రెండో రోజూ వాట్సప్లో క్వషన్ పేపర్ చక్కర్లు
- వరంగల్లో ఘటన… తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు
రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారం కలకలం రేపుతోంది. తెలంగాణలో సోమవారం నుం చి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాగా తొలిరోజే వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష మొదలైన ఏడు నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టింది. ఈ పేపర్ లీక్కు కారణమైన నలుగురు అధికారులు (సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్తోపాటు ఇద్దరు ఇన్విజిలేటర్లు)ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. పేపర్ లీక్పై ఘటనపై పూర్తిస్థాయిలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇవాళ మరో ప్రశ్నాపత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వరంగల్లో రెండో రోజు పదో తరగతి హిందీ పరీక్షాపత్రం లీక్ అయింది. మంగళవారం ఉదయం 9:30 నిమిషాలకు హిందీ పరీక్ష ప్రారంభం కాగా, 10:05 గంటలకు వాట్సప్లో క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.