Saturday, July 27, 2024

ఆర్టీసీ బస్సు బైక్ ఢీ

Must Read

బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలుము

గ్గురి పరిస్థితి విషమం

ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలింపు

అక్షరశక్తి ములుగు క్రైమ్ , : ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొన్న ఘటనలో నలుగురి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిoచి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాం నగర్ గోత్తికోయ గూడేంకు చెందిన మడవి సురేష్ , చిన్నారి దంపతులు కుమారుడు మడవి నవీన్, కుమార్తె మడవి ఇలాషా తో మంగపేట గవర్నమెంట్ ఆసుపత్రి వైపు నుంచి బైక్ స్తుండగా మంగపేట బస్టాండ్ నుండి హన్మకొండకు వెళుతున్న బస్సు తెలంగాణ సెంటర్ లో ఢీ కొంది. ఈ ప్రమాదంలో మడవి సురేష్ ,చిన్నారి దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు బైక్ నుంచి కిందపడ్డారు. ప్రమాదం గమనించిన స్థానికులు 108 కి , మంగపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని మంగపేట ప్రభుత్వ ఆసుపత్రికి ,అనంతరం అక్కడ నుండి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మడవి నవీన్, మడవి సురేష్, మడవి చిన్నారిల ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img