Friday, July 26, 2024

ఎమ్మెల్యే పెద్ది స‌హ‌కారంతో అన్ని గ్రామాల్లో రోడ్లు

Must Read

అక్షరశక్తి, ఖానాపూరం: వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో సీసీ రోడ్డును ఆదివారం ఓడీసీఎంఎస్ చైర్మ‌న్‌, మండల పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యులు ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పల్లె ప్రగతిలో ఇచ్చిన హామీ మేరకు ఖానాపురం జెడ్పీటీసీ సభ్యులు బత్తిని స్వప్న-శ్రీనివాస్ గౌడ్ జడ్పీటీసీ నిధుల నుండి 6లక్షల 5 వేల రూపాయలతో ఖానాపురం మండలకేంద్రం గుండ్ల బజార్లో నేడు సీసీ రోడ్డును జిల్లా ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, మండల పరిషత్ అధ్యక్షుడు వేములపల్లి ప్రకాష్ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, ఎంపీటీసీ మర్రి కవిత-రామస్వామి, సర్పంచ్ శాఖమూరి చిరంజీవి-హరిబాబు, ఉప సర్పంచ్ మేడిద కుమార్, రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు బొప్పిడి పూర్ణచందర్ రావు, వార్డు సభ్యులు జటంగి నాగరాజు, గంగాపురం స్రవంతి-రాజు, తౌడోజు సంధ్య-కృష్ణ, గ్రామపార్టీ అధ్యక్షుడు మచ్చిక అశోక్, టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ముద్దంగుల రవీందర్, దాసరి రమేష్, రెడ్డి నాగార్జున రెడ్డి, ఉప్పు వెంకటేశ్వర్లు, చెన్నూరి సత్యం, కేశోజు రాములు, నరహరి, వెంకట్రావు, జినుకల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img