అక్షరశక్తి, వరంగల్ : హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, పరకాల నియోజకవర్గాల్లో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, తాను స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ రెండునియోజకవర్గాల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.