అక్షరశక్తి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. తనను కలవడానికి ఎవ్వరూ రావద్దని కోరారు. గత కొన్ని రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.