తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సింగిరెడ్డి సూచించారు.
Latest News