ఉత్తరప్రదేశ్ : మధుర పరిధిలోని దౌల్తాపూర్లో ఆయుధాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది పిస్టళ్లు, నాలుగు గన్స్, పదమూడు లైవ్ రౌండ్స్, ఇతర ఆయుధాలు, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎవరికీ అనుమానం రాకుండా, ఆయుధాలు తయారు చేస్తూ విక్రయిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.