Saturday, July 27, 2024

సీఎం అభ్య‌ర్థిని ఎంపిక చేసేది ప్ర‌జ‌లే..

Must Read

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ త‌రుపున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఎంపిక చేసే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కే ఇస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు.

అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు కాల్‌/ మెసేజ్‌ లేదా వాట్సాప్‌ చేయాలని అన్నారు. పంజాబ్‌లోని మూడు కోట్ల మంది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తాము అనుకుంటున్నామ‌ని, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ ఎంపికను తెలియజేయాలని, ప్ర‌జాభిప్రాయం మేర‌కు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయ‌డం ఇదే మొద‌టిసార‌ని కేజ్రీవాల్‌ అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img