Saturday, September 7, 2024

కార్మికులకు కేసీఆర్‌, జ‌గ‌న్ మేడే శుభాకాంక్షలు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకొంటూ విజయవంతంగా అమలవుతున్నదని చెప్పారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.


‘‘శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు.’’ అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img