అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ, తాగుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరినీ అరెస్టు చేయగా ఒకరు పారిపోయారు. టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం . హనుమకొండ న్యూ శాయంపేటకు చెందిన విద్యార్థి( 27) జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (20) నయీ0 నగర్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నారు. ముగ్గురు కలిసి కేయూ డబ్బాల క్రాస్ వద్ద గంజాయి విక్రయిస్తూ. తాగుతున్నారని సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు పట్టుపడ్డారు మరొకరు పారిపోయారు. వీరి నుంచి రూపాయి 26,వేల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనం, స్మార్ట్ ఫోన్,రూ.14,200 నగదు స్వాధీనం చేసుకున్నామని, విచారణ కోసం కేయూ పోలీసులకు అప్పగించా మ ని తెలిపారు.