Saturday, July 27, 2024

గ‌డ్డ‌పార ప‌ట్టిన‌ మంత్రి ఎర్రబెల్లి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో సిటీ స్కాన్ ని ప్రారంభించిన అనంతరం తన పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబరంలో శిక్షణ పొందుతున్న వాళ్ళకి స్టడీ మెటీరియల్ అంద చేయడానికి వెళుతూ మార్గమధ్యంలో, పర్వతగిరి మండలం తుర్కల సోమారం గ్రామం నల్లకుంట తండా వాసులు, తమ చెరువులో పూడికతీత పనులు చేస్తున్న దృశ్యాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి కూలీల దగ్గరకు వెళ్లారు. ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. ఉపాధి కూలీల సమస్యలు ఎమైనా ఉన్నాయా? అని అడిగారు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి గడ్డ పార అందుకున్నారు. పక్కనే కూలీలు వేస్తున్న మాదిరిగానే గడ్డపార వేసి, మట్టి పెళ్ళలను పెకిలించారు. తట్ట పట్టి మట్టి ఎత్తారు. దీంతో అక్కడి కూలీలు అంతా ఆశ్చర్య పోయారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img