Saturday, July 27, 2024

జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఈసం నారాయ‌ణ

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్‌: కాక‌తీయ యూనివర్సిటీ జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఈసం నారాయ‌ణ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేయూ రిజిస్ట్రార్ టి శ్రీనివాస‌రావు ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ బాధ్య‌త‌ల్లో కొన‌సాగిన ప్రొఫెస‌ర్ వై వెంక‌య్య ప‌ద‌వీకాలం ముగియ‌డంతో నారాయ‌ణ‌ను నియ‌మించారు. రెండేళ్ల‌పాటు నారాయ‌ణ ఈ ప‌ద‌విలో కొన‌సాగనున్నారు. ప్ర‌స్తుతం కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈసం నారాయ‌ణ అద‌న‌పు ప‌రీక్ష‌ల నియంత్ర‌ణాధికారిగా ప‌నిచేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్ట‌ర్ గాను బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కాగా, జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా నూత‌నంగా నియ‌మితులైన సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ ఈసం నారాయ‌ణను ప్రొఫెస‌ర్లు డాక్ట‌ర్ మామిడాల ఇస్తారి, డాక్ట‌ర్ ష‌మిత అభినందించారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు పొందాలని ఆకాంక్షించారు. ఈసంద‌ర్భంగా ఈసం నారాయ‌ణ మాట్లాడుతూ… త‌న‌పై న‌మ్మ‌కంతో జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన కేయూ వీసీ ఆచార్య తాటికొండ ర‌మేశ్‌, రిజిస్ట్రార్ టి శ్రీనివాస‌రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img