అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణతల్లి విగ్రహం, ఛత్రపతి శివాజీ మార్గ్, మర్కజీ జంక్షన్ వద్ద హనుమకొండ జిల్లా జేఏసీ కార్మిక నాయకుడు తాడిశెట్టి కుమారస్వామి, జూకంటి రవీందర్, నలుబొల అమరేందర్ ఎర్ర జెండాని ఎగురవేశారు.
అనంతరం హనుమకొండ జిల్లా...
కార్మికులకు ఎమ్మెల్యే నరేందర్ మేడే శుభాకాంక్షలు
అక్షరశక్తి, వరంగల్ తూర్పు: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వరంగల్ కూరగాయల మార్కెట్తోపాటు పలుచోట్ల కార్మికులతో కలిసి జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల...
అక్షరశక్తి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్స్ట్రోక్తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే...
కొత్తగూడ మండలంలో విషాదం
అక్షరశక్తి, కొత్తగూడ: కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తింటి వారి దాడిలో అల్లుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికుల కథనం మేరకు... మండలంలోని వెలుబెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో అత్తింటి వారు అల్లుడిపై దాడి చేశారు. ఈ ఘటనలోఐరెండ్ల యాదగిరి (35) అనే వ్యక్తి...
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పేరుకుపోయిన ఈ-చలాన్లను క్లియర్ చేసేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. క్యాటగిరీ ప్రకారం రాయితీ ఇచ్చి, సుమారు 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐడియా పోలీసులకు బాగానే వర్కవుట్ అయినప్పటికి...
ఆ ఆడియో తనది కాదు : మహేందర్రెడ్డి
తాండూరు టౌన్ సీఐ రాజేందర్రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ బూతుపురాణం ఆడియో వైరల్ అవడంతో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ఆడియో తనది కాదని... ఈ విషయంలో కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా...
యజమానికి శునకం షాక్
అక్షరశక్తి, నర్సంపేట: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న 1.50 లక్షల నగదు సంచిని ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కాసు చేరాలు గొర్రెల కాపారి. ఆయన కుక్కను పెంచుకుంటున్నాడు. చేరాలు తాను...
మార్కులు సాకుగా చూపి లైంగిక వేధింపులు
చితకబాదిన తల్లిందండ్రులు
పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
అక్షరశక్తి, మహబూబాబాద్ : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధి చూపాడు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది....
పెట్రోల్పై ఏపీ, తెలంగాణ వ్యాట్ తగ్గించాలి..
దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని.. కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్ను తగ్గించడం లేదని అన్నారు. రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు....
భారీగా పెరగనున్న బీర్ల ధరలు
ఇప్పటికే అన్ని నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంట నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు.. ఇలా అన్ని సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అయితే.. ఇప్పుడు బీర్ల ధరలు కూడా భారీగా పెరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల రేటు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి సరుకు...