వరంగల్లో దారుణం జరిగింది. కన్నతండ్రే చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠాకు తన కన్న కొడుకును
అమ్ముకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో తండ్రిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అతడు ఇచ్చిన సమాచారంతో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో 96 పోస్టులు ..
తుది గడువు జూన్ 11
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్ సైకిల్ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆదారం గా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్ధులు బ్రాంచ్ పోస్టు...
వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ జెడ్పీటీసీ మృతి చెందాడు. గీసుగొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో కారు, బస్సు ఢీకొనడంతో కేసముద్రం మాజీ జెడ్పీటీసీ వేం పురుషోత్తంరెడ్డి అ క్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు,...
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి మే 14 వరకు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు....
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట పట్టణంలోని రైల్వే కాలనీలో బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెండాడు.
వివరాల్లోకి వెళ్తే.... ఉత్తర ప్రదేశ్కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు తమ కుమారుడు చోటు (8)...
మందుపాతరతో మినీ బస్సు పేల్చివేత
11 మంది జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. అదును చూసి భద్రతాబలగాలపై దాడులకు దిగారు. దంతేవాడలోని అరణ్పూర్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఐఈడీ మందు పాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన జవాన్లను...
మానుకోట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గార్ల మండల జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెన్షన్కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే...
వరంగల్ నిట్లో గల న్యూలేడీస్ హాస్టల్లో బీ-10 రూంలో అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్లో ఉన్న విద్యార్థినులంతా కళాశాలలో జరిగే ఈవెంట్కు వెళ్ళాక షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. యాజమాన్యం సమాచారం మేరకు హుటాహుటిన కళాశాలకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. సుమారుగా రూ....
అక్షరశక్తి, మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామవాసి బీ దేవయ్యకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రధానం చేసింది. అర్థశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ జీ రామకృష్ణ పర్యవేక్షణలో "ఎఫెక్టివ్నెస్ అఫ్ ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఏ ఏ కేస్ స్టడీ అఫ్ మెదక్ డిస్ట్రిక్ట్ ష అంశంపై...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తాజాగా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తన కుమార్తెను అరెస్ట్ చేయడంతో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లారు. పీఎస్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మహిళా...