- ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా..
- తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ అభ్యర్థి వేణుచారి
- వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం
అక్షరశక్తి, హనుమకొండ : అవినీతిని ఓడించండి.. అభివృద్ధికి పట్టంకట్టండని తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ అభ్యర్థి అయిలాపురం వేణుచారి ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ నుంచి బరిలోకి దిగిన వేణుచారి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయా డివిజన్లలో అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానని కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.ఈమేరకు శుక్రవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి నయీమ్ నగర్, కేయూ క్రాస్, డబ్బాల్, యాదవనగర్ వరకు యువకులు, మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుచారి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు సంచులతో పోటీ పడుతున్నారని, వీరిలో ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏంలేదన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలిచిన తరువాత అంతకు రెట్టింపు వసూలు చేసుకోవడానికి అనుచరులను రంగంలోకి దించుతారని హెచ్చరించారు. యువకులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఆలోచన చేయాలని, ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు అమూల్యమైన ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. పబ్లిక్ గార్డెన్ నుండి మొదలైన పాదయాత్ర ఏడు కిలోమీటర్లు సాగింది.
యాత్రలో రుద్రారపు కోటిలింగం, వేమూనూరి సుధీర్ కుమార్, శ్రవణ్, క్రాంతికుమార్, కిరణ్, వసంత, సుధారాణి, అనూష, మణిచందన, సుజాత, పూజిత, పద్మ, రాజ్కుమార్తోపాటు సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
Must Read