కాంగ్రెస్లో చేరిన శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్..మరికొందరు నేతలు..
అక్షరశక్తి, శాయంపేట: శాయంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, మాందారిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్, ప్రముఖ అడ్వకేట్ మామిడి చిరంజీవి, పద్మశాలి సంఘం మండల ప్రెసిడెంట్ బాసాని లక్ష్మీనారాయణ, కోగిల అర్జున్, కోగిల కిరణ్తోపాటు మండలం నుండి సుమారు మరో 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరందరికీ శాయంపేట మండల కేంద్రంలో జరిగిన ప్రజా దీవెన యాత్రలో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కటంగూరి రాంనర్సింహారెడ్డి, అధికార ప్రతినిధి గాదర్ల అశోక్ ఉన్నారు. భూపాలపల్లిలో గండ్ర సత్తన్న గెలుపు ఖాయమైందని, గండ్ర సత్తన్నను ఎమ్మెల్యేగా లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని నూతనంగా పార్టీలో చేరిన వారు అన్నారు.
Must Read