- ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాల్తేర్ వీరయ్య విజయోత్సవ సభ
- సందడిచేయనున్న రవితేజ, శృతిహాసన్
రేపు హన్మకొండలో మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ శనివారం నగరానికి రానున్నారు. చిరు నటించిన వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.దీంతో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రేపు సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈమేరకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హీరో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, హీరోయిన్ శృతిహాసన్తోపాటు యూనిట్ సభ్యులు పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. చిరు రాక కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్లో బైక్ ర్యాలీ నిర్వహించి అభిమానం చాటుకున్నారు.
Must Read