అక్షరశక్తి, భీమదేవరపల్లి: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మంగ రాజు కుమారుడు మంగ శివకుమార్ (14) ప్రమాదవశాత్తు వ్యవసాయబావి లో పడి మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు. ఘటనా స్థలానికి ముల్కనూర్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.