సీఎం కేసీఆర్ పిలుపు
అక్షరశక్తి: కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నారు.