ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో రేవంత్పై ఘాటుగా స్పందించారు. రాజీవ్గాంధీపై అస్సాం సీఎం అనైతికంగా మాట్లాడడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. కానీ.. రేవంత్ మాత్రం సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ జీ.. మీరు ఒక నీచమైన మనిషిని టీపీసీసీ చీఫ్గా ఎన్నుకున్నారు. అతను త్వరగానే కోలుకుంటాడని అనుకుంటున్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Latest News