Saturday, July 27, 2024

యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్న‌ సర్కారు వారి పాట

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : సూపర్​ స్టార్ మహేశ్​ బాబు, మహానటి కీర్తి సురేష్ లు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో విలన్​గా సముద్ర ఖని అలరించనున్నారు. ఈ నెల‌ 12న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్​లో స్పీడు పెంచిన చిత్ర యూనిట్ మే 2న ట్రైలర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసింది. ఈ వ్యూస్​తోపాటు ఒక మిలియన్​ లైక్స్​ సాధించింది. ప్ర‌స్తుతం ఈ సినిమా ట్రైలర్​ యూట్యూబ్​లో నెంబర్​ వన్​ స్థానంలో ట్రెండ్​ అవుతోంది. ఇప్పుడే ఇన్ని లైక్స్​, వ్యూస్​ సాధించిన ఈ చిత్రం 24 గంటలు గడిస్తే మరెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img