Saturday, July 27, 2024

ఇన్ని రోజులు ఎటు పోయినవ్‌..? ఇప్పుడు ఎందుకొచ్చిన‌వ్‌..?

Must Read
  • ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌కు నిర‌స‌న సెగ‌
  • కుర‌వి మండ‌లంలో ఘ‌ట‌న‌
    అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్‌పై తిరుగుబాటు మొద‌లైంది. నియోజ క‌ర్గ పర్య‌ట‌న‌లో ఇటీవ‌ల వ‌రుస‌గా ఆయ‌న‌కు చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. నిన్న కురవి మండ లంలోని కందికొండ, సూదనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ప‌ర్య‌టించారు. ఈక్ర‌మంలో సూద‌న‌ప‌ల్లి గ్రామంలో ప్ర‌సంగించి స్జేజీ దిగి వెళ్తుండ‌గా.. కొంద‌రు గ్రామ‌స్తులు అడ్డుత‌గిలారు. ఇన్ని రోజులు ఎటు పోయిన‌వ్… ? మా గ్రామానికి ఏం చేసిన‌వ్ ..? చెప్పాలంటూ అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇప్ప‌డు ఎందుకొచ్చావ్ అంటూ నిల‌దీశారు. దీంతో వారికి స‌మాధానం చెప్ప‌కుండానే ఎమ్మెల్యే ముందుకు క‌దిలారు. అయిన‌ప్ప‌టికీ గ్రామ‌స్తులు ఆయ‌న్ను చుట్టుముట్ట‌డంతో పోలీసులు జోక్యం చేసుకుని వారికి నచ్చ‌జెప్పారు. ఎమ్మెల్యేను కారులో ఎక్కించి పంపారు. గ‌తంలో కూడా మ‌రిపెడ‌, న‌ర్సింహుల‌పేట మండ‌లాల్లో రెడ్యాకు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఆయా గ్రామాల్లో స‌మ‌స్య‌ల‌పై ప‌లువురు యువ‌కులు ఎమ్మెల్యేను నిల‌దీశారు. ఓట‌మి ఎరుగ‌ని నేతగా, సౌమ్యుడిగా రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ ఇన్నేండ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర్కోవ‌డం ఇదే తొలిసారి అని నియోజ‌క‌ర్గంలో చ‌ర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. మంగ‌ళ‌వారం అయ్య‌గారిప‌ల్లి గ్రామంలో ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ ఆవిష్క‌రించాల్సిన శిలాఫ‌ల‌కాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చే య‌డం క‌ల‌క‌లంరేపింది. మ‌రో నాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లు ఉండ‌గా, డోర్న‌క‌ల్ నియోజ‌క‌ర్గంలో చోటుచేసుకుంటున్న ఈ ప‌రిణామాలు భ‌విష్య‌త్‌లో ఎటు దారి తీస్తాయోన‌ని అధికార బీఆర్ఎస్ నా య‌కులు, గులాబీ శ్రేణులు మ‌దన‌పడుతున్నాయి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img