Saturday, July 27, 2024

అప్పుడు మీరెక్క‌డున్నారు..?

Must Read

కేటీఆర్, కవితపై రేవంత్ ఫైర్‌

తెలంగాణ‌లో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్ నేతల ట్వీట్లకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్‌ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చి.. రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరెక్కడున్నారని ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు రేవేంత్ రెడ్డి. వరివేస్తే ఉరి అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి.. ఫాం హౌస్ లో 150 ఎకరాల్లో వరి వేసినప్పడు ఎక్కడున్నారని కవితపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ఒక్క టీఆర్ఎస్ నేత పరామర్శించలేదన్నారు.

రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని కేసీఆర్ మోసం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఐదేళ్లవుతున్నా.. అర క్వింటా ఎరువులు కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాశులు తడిచి రైతులు వి లపిస్తున్నారని.. వారి కష్టాన్ని పట్టించుకోలేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడారని ధ్వ‌జ‌మెత్తారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img